Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:09 AM

ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు

ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు

ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు
12-03-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రతి మనిషి గుండెల్లో దివంగత నాయకుడు వైయస్. రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన తరువాత యావత్ ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వైయస్.జగన్మోహన్ రెడ్డి ను ఆరాధిస్తున్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

స్థానిక వైఎస్సార్ విగ్రహానికి కన్వీనర్ గజేంద్ర ఆధ్వర్యంలో ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, నారాయణరెడ్డి, లక్ష్మీనరసప్ప సమక్షంలో దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని, ప్రతి ఇంటిలో జగన్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారు ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ మరింత శక్తివంతమైన పార్టీగా అవతరిస్తుందని అన్నారు.

అనంతరం కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో చాలాకూరు లక్ష్మీనరసప్ప, మాజీ కన్వీనర్ నారాయణరెడ్డి, ముద్దాపుకుంట కిష్టప్ప, కంబాలప్ప, ఆదినారాయణరెడ్డి, యూత్ నాయకుడు నరసింహమూర్తి, ట్రాక్టర్ శ్రీరాములు, పట్టణ ఉపాధ్యక్షుడు మాదన మంజు, వార్డు మెంబర్లు లక్ష్మీరెడ్డి, గాజుల శ్రీకాంత్, జరి రామాంజి, మహిళా నాయకురాళ్లు గాజుల మణెమ్మతో పాటు అమర్, మహేష్, బొంబాయి బాబు, మాజీ డీలర్ బాబు తదితరులు పాల్గొన్నారు


Sthanikam

ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు

Article Image

సోమందేపల్లి: ప్రతి మనిషి గుండెల్లో దివంగత నాయకుడు వైయస్. రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన తరువాత యావత్ ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వైయస్.జగన్మోహన్ రెడ్డి ను ఆరాధిస్తున్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

స్థానిక వైఎస్సార్ విగ్రహానికి కన్వీనర్ గజేంద్ర ఆధ్వర్యంలో ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, నారాయణరెడ్డి, లక్ష్మీనరసప్ప సమక్షంలో దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని, ప్రతి ఇంటిలో జగన్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారు ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ మరింత శక్తివంతమైన పార్టీగా అవతరిస్తుందని అన్నారు.

అనంతరం కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో చాలాకూరు లక్ష్మీనరసప్ప, మాజీ కన్వీనర్ నారాయణరెడ్డి, ముద్దాపుకుంట కిష్టప్ప, కంబాలప్ప, ఆదినారాయణరెడ్డి, యూత్ నాయకుడు నరసింహమూర్తి, ట్రాక్టర్ శ్రీరాములు, పట్టణ ఉపాధ్యక్షుడు మాదన మంజు, వార్డు మెంబర్లు లక్ష్మీరెడ్డి, గాజుల శ్రీకాంత్, జరి రామాంజి, మహిళా నాయకురాళ్లు గాజుల మణెమ్మతో పాటు అమర్, మహేష్, బొంబాయి బాబు, మాజీ డీలర్ బాబు తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News