సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారన్న కేసులో బెయిల్..
సత్తెనపల్లి, ఫిబ్రవరి 18: సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారన్న ఆరోపణలపై 2023లో సత్తెనపల్లి పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఇప్పటికే సీఎం యన్ . చంద్రబాబు నాయుడు ను దూషించిన కేసు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న మరో కేసులో కూడా అంబటికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్లో ఉన్న అంబటి, తాజా ఉత్తర్వులతో వరుసగా మూడో కేసులోనూ ఉపశమనం పొందారు.
కోర్టు తీర్పుతో అంబటి వర్గాల్లో ఊపిరి పీల్చుకున్న వాతావరణం నెలకొనగా, కేసులపై తదుపరి విచారణ కొనసాగనుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి