ప్రజాసేవే శ్వాసగా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం – తమ్మినేని సీతారాం
ప్రజాసేవే శ్వాసగా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం – తమ్మినేని సీతారాం
Editor Desk
విలువల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం
పదవికే అలంకరణగా నిలిచిన నేత
గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజాసేవనే ధ్యేయంగా, విలువలతో కూడిన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ అవినీతి, కుట్ర రాజకీయాలకు దూరంగా నిలుస్తున్న నాయకుడిగా మాజీ మంత్రి, శాసనసభాపతి శ్రీ తమ్మినేని సీతారాం ప్రజల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.పదవిని అలంకారంగా కాకుండా, పదవికే తాను అలంకరణగా నిలుస్తూ ఆముదాలవలస అభివృద్ధినే తన శ్వాసగా భావిస్తూ సేవలందిస్తున్న ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, విలువల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తమ్మినేని సీతారాం సేవలు అనేక తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ప్రసాదించాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయిలను అధిరోహించే శక్తిని భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వం మరింత వెలుగొందుతూ మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి