Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:13 AM

ఇంచార్జ్ ఈడిగ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఇంచార్జ్ ఈడిగ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఇంచార్జ్ ఈడిగ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
03-03-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం కేంద్రంలోని ఎంక్విఏ గ్లోబల్ ట్రస్ట్ కార్యాలయంలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని పెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఈడీగా కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పర్యవేక్షకులు మరియు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో ఉంటుందని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

పెనుకొండ జనసేన పార్టీ ఇంచార్జ్ ఈడీగా కుమార్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, చేనేత రాష్ట్ర కార్యదర్శి ఎర్రిస్వామి చెప్పాలా, మండలాల కన్వీనర్లు జభీ, సురేష్, సంతోష్, మహేష్, అలాగే నాయకులు నాగరాజ్, శ్రీనివాసులు, వరలక్ష్మి, మంజు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

ఇంచార్జ్ ఈడిగ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం కేంద్రంలోని ఎంక్విఏ గ్లోబల్ ట్రస్ట్ కార్యాలయంలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని పెనుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఈడీగా కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం పర్యవేక్షకులు మరియు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో ఉంటుందని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

పెనుకొండ జనసేన పార్టీ ఇంచార్జ్ ఈడీగా కుమార్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, చేనేత రాష్ట్ర కార్యదర్శి ఎర్రిస్వామి చెప్పాలా, మండలాల కన్వీనర్లు జభీ, సురేష్, సంతోష్, మహేష్, అలాగే నాయకులు నాగరాజ్, శ్రీనివాసులు, వరలక్ష్మి, మంజు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News