PRINT TIME: April 24, 2026 02:15 AM
కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు
కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు
April 23, 2026 11:49 PM
1 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేతగానిచెరువు గ్రామంలో భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి వెంకటరమణ సాయంత్రం గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన భగీరథ మహర్షి విగ్రహానికి పూజలు నిర్వహించి పూలమాల అర్పించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ముత్యాల పల్లకిలో భగీరథ మహర్షి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ రాష్ట్ర డైరెక్టర్ వెంకటేశులు, బెంగళూరు పారిశ్రామిక వేత్త సి.ఎన్. రామ్, నాగరాజు, గ్రామ యువనాయకులు లోకేంద్ర, వెంకటేశులు, కబాబ్ అంజి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి