PRINT TIME: March 16, 2026 05:07 PM
చౌడమ్మ జ్యోతులకు ఎస్ఐకి ఆహ్వానం – బందోబస్త్ నిర్వహించాలని వినతి
చౌడమ్మ జ్యోతులకు ఎస్ఐకి ఆహ్వానం – బందోబస్త్ నిర్వహించాలని వినతి
March 16, 2026 03:19 PM
2 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి: తోగట వీర క్షత్రియుల ఆరాధ్య దైవం అయిన శ్రీ చౌడేశ్వరి మాత పంచమ జ్యోతి మహోత్సవం ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున సోమందేపల్లిలో జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం చౌడేశ్వరి దేవి ఆలయ ధర్మకర్త, మాజీ సర్పంచ్, మాస్టర్ వీవర్ డీసీ ఈశ్వరయ్య ఎస్ఐ రమేష్ బాబును కలిసి ఆహ్వానించారు.
ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగే ఈ జ్యోతి మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమానికి ఎస్ఐ రమేష్ బాబు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహోత్సవానికి తగిన బందోబస్త్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జ్యోతి సంఘం అధ్యక్షుడు బండారు శీనా తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి