PRINT TIME: June 27, 2026 12:23 AM
రొద్దంలో ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు
రొద్దంలో ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు
May 12, 2026 03:15 PM
56 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
రొద్దం మండలంలో ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పండితులు గిరిస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేడుకల సందర్భంగా భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయంలో ఆంజనేయ స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాల వల్ల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి