Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:38 PM

అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి

అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి

అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి
April 04, 2026 08:18 PM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండ మండలం ఆడదాకలపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

“జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. స్వామివారిని పూలమాలలు, పండ్లతో అలంకరించి వేద మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సోమందేపల్లి గ్రామానికి చెందిన భజన బృందం చేసిన భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హనుమంతుడి మహిమను గానం చేస్తూ వారు ఆలపించిన కీర్తనలు భక్తులను భక్తి రసంలో ముంచెత్తాయి.

అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. కమిటీ సభ్యులు చేసిన సమగ్ర ఏర్పాట్లతో భక్తులు సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News