అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి
అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండ మండలం ఆడదాకలపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
“జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. స్వామివారిని పూలమాలలు, పండ్లతో అలంకరించి వేద మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సోమందేపల్లి గ్రామానికి చెందిన భజన బృందం చేసిన భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హనుమంతుడి మహిమను గానం చేస్తూ వారు ఆలపించిన కీర్తనలు భక్తులను భక్తి రసంలో ముంచెత్తాయి.
అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. కమిటీ సభ్యులు చేసిన సమగ్ర ఏర్పాట్లతో భక్తులు సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి