Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:39 AM

అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి

అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి

అడవిలో ఆధ్యాత్మిక హోరు – శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల సందడి
April 04, 2026 08:18 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండ మండలం ఆడదాకలపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

“జై శ్రీరామ్ – జై హనుమాన్” నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. స్వామివారిని పూలమాలలు, పండ్లతో అలంకరించి వేద మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సోమందేపల్లి గ్రామానికి చెందిన భజన బృందం చేసిన భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హనుమంతుడి మహిమను గానం చేస్తూ వారు ఆలపించిన కీర్తనలు భక్తులను భక్తి రసంలో ముంచెత్తాయి.

అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. కమిటీ సభ్యులు చేసిన సమగ్ర ఏర్పాట్లతో భక్తులు సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News