Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 09:02 PM

రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం

రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం

రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం
April 06, 2026 08:23 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

ఆరు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు… అన్నదానం నిర్వహణ

రాయికోడ్ (అందోల్),

జిల్లాలోని పురాతన శైవ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రాయికోడ్ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ప్రారంభం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఆరు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరలో భాగంగా 6న ధ్వజారోహణం, శిఖరపూజ, భద్రకాళీ కుంకుమార్చన, వీరభద్ర స్వామి అభిషేకం, బసవేశ్వర అభిషేకం నిర్వహించారు.7న మహారుద్రాభిషేకం, పల్లకిసేవ, అగ్నిగుండం, గణపతి హోమం, స్వామివారి కల్యాణం, సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి భజన కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బీచ్కుందకు చెందిన సోమలింగ శివాచార్యులచే తీర్థప్రసాదాల పంపిణీ, పెద్దిరాజు పెద్దమ్మ నాటక ప్రదర్శనలు జరుగనున్నాయి.8, 9 తేదీల్లో సహస్ర బిల్వార్చన, కుంకుమార్చన, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 10న ఆకుల పూజ, దంపతుల పూజ, 11న స్వామివారికి అభిషేకాలు నిర్వహించి జాతర ఉత్సవాలు ముగించనున్నారు.జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.న్యాల్కల్ (జహీరాబాద్):

మండల పరిధిలోని మేరియంపూర్ సమీపంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో నేటినుంచి జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News