Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్ గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 10:23 PM

రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం

రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం

రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం
April 06, 2026 08:23 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

ఆరు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు… అన్నదానం నిర్వహణ

రాయికోడ్ (అందోల్),

జిల్లాలోని పురాతన శైవ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రాయికోడ్ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ప్రారంభం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఆరు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరలో భాగంగా 6న ధ్వజారోహణం, శిఖరపూజ, భద్రకాళీ కుంకుమార్చన, వీరభద్ర స్వామి అభిషేకం, బసవేశ్వర అభిషేకం నిర్వహించారు.7న మహారుద్రాభిషేకం, పల్లకిసేవ, అగ్నిగుండం, గణపతి హోమం, స్వామివారి కల్యాణం, సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి భజన కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బీచ్కుందకు చెందిన సోమలింగ శివాచార్యులచే తీర్థప్రసాదాల పంపిణీ, పెద్దిరాజు పెద్దమ్మ నాటక ప్రదర్శనలు జరుగనున్నాయి.8, 9 తేదీల్లో సహస్ర బిల్వార్చన, కుంకుమార్చన, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 10న ఆకుల పూజ, దంపతుల పూజ, 11న స్వామివారికి అభిషేకాలు నిర్వహించి జాతర ఉత్సవాలు ముగించనున్నారు.జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.న్యాల్కల్ (జహీరాబాద్):

మండల పరిధిలోని మేరియంపూర్ సమీపంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో నేటినుంచి జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News