రాయికోడ్లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం
రాయికోడ్లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం
Reporter Sangameshwar Reddy
ఆరు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు… అన్నదానం నిర్వహణ
రాయికోడ్ (అందోల్),
జిల్లాలోని పురాతన శైవ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రాయికోడ్ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర ప్రారంభం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఆరు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరలో భాగంగా 6న ధ్వజారోహణం, శిఖరపూజ, భద్రకాళీ కుంకుమార్చన, వీరభద్ర స్వామి అభిషేకం, బసవేశ్వర అభిషేకం నిర్వహించారు.7న మహారుద్రాభిషేకం, పల్లకిసేవ, అగ్నిగుండం, గణపతి హోమం, స్వామివారి కల్యాణం, సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి భజన కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. బీచ్కుందకు చెందిన సోమలింగ శివాచార్యులచే తీర్థప్రసాదాల పంపిణీ, పెద్దిరాజు పెద్దమ్మ నాటక ప్రదర్శనలు జరుగనున్నాయి.8, 9 తేదీల్లో సహస్ర బిల్వార్చన, కుంకుమార్చన, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 10న ఆకుల పూజ, దంపతుల పూజ, 11న స్వామివారికి అభిషేకాలు నిర్వహించి జాతర ఉత్సవాలు ముగించనున్నారు.జాతర సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.న్యాల్కల్ (జహీరాబాద్):
మండల పరిధిలోని మేరియంపూర్ సమీపంలోని వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో నేటినుంచి జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి