శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని ఈదులబలాపురం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామమంతా భక్తి పరవశంతో మునిగిపోయింది.
జ్యోతుల మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు చేతుల్లో జ్యోతులు పట్టుకుని “రామ నామం” జపిస్తూ గ్రామం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. ప్రతి వీధి “జై శ్రీరామ్” నినాదాలతో మార్మోగింది.
పిల్లలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని భక్తి భావాన్ని చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా, అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి