Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 10:20 PM

సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ

సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ

సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ
21-03-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనలు ప్రారంభించిన భక్తులు, అనంతరం భారీ ర్యాలీగా ఈద్గా వైపు కదిలారు.

ర్యాలీ మొత్తం భక్తి నినాదాలతో మార్మోగింది. ముఖ్యంగా ఇస్లాం మత వ్యవస్థాపకులు మొహమ్మద్ వ్రవక్త పేరు జపిస్తూ ముస్లిం సోదరులు అడుగడుగునా తమ భక్తిని వ్యక్తం చేశారు. చిన్నారులు నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

సోమందేపల్లి నుండి ఈద్గా వరకు సాగిన ఈ ర్యాలీకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించగా, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా సమర్థంగా నియంత్రించారు.

మొత్తం మీద రంజాన్ ఆరంభ వేడుకలు సోమందేపల్లిలో ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో సాగాయి.


Sthanikam

సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ

Article Image

సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనలు ప్రారంభించిన భక్తులు, అనంతరం భారీ ర్యాలీగా ఈద్గా వైపు కదిలారు.

ర్యాలీ మొత్తం భక్తి నినాదాలతో మార్మోగింది. ముఖ్యంగా ఇస్లాం మత వ్యవస్థాపకులు మొహమ్మద్ వ్రవక్త పేరు జపిస్తూ ముస్లిం సోదరులు అడుగడుగునా తమ భక్తిని వ్యక్తం చేశారు. చిన్నారులు నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

సోమందేపల్లి నుండి ఈద్గా వరకు సాగిన ఈ ర్యాలీకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించగా, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా సమర్థంగా నియంత్రించారు.

మొత్తం మీద రంజాన్ ఆరంభ వేడుకలు సోమందేపల్లిలో ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో సాగాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News