సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ
సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనలు ప్రారంభించిన భక్తులు, అనంతరం భారీ ర్యాలీగా ఈద్గా వైపు కదిలారు.
ర్యాలీ మొత్తం భక్తి నినాదాలతో మార్మోగింది. ముఖ్యంగా ఇస్లాం మత వ్యవస్థాపకులు మొహమ్మద్ వ్రవక్త పేరు జపిస్తూ ముస్లిం సోదరులు అడుగడుగునా తమ భక్తిని వ్యక్తం చేశారు. చిన్నారులు నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
సోమందేపల్లి నుండి ఈద్గా వరకు సాగిన ఈ ర్యాలీకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యస్ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించగా, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా సమర్థంగా నియంత్రించారు.
మొత్తం మీద రంజాన్ ఆరంభ వేడుకలు సోమందేపల్లిలో ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో సాగాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి