Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 01:20 AM

సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ

సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ

సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ
March 21, 2026 04:34 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి పట్టణంలో పవిత్ర రంజాన్ మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనలు ప్రారంభించిన భక్తులు, అనంతరం భారీ ర్యాలీగా ఈద్గా వైపు కదిలారు.

ర్యాలీ మొత్తం భక్తి నినాదాలతో మార్మోగింది. ముఖ్యంగా ఇస్లాం మత వ్యవస్థాపకులు మొహమ్మద్ వ్రవక్త పేరు జపిస్తూ ముస్లిం సోదరులు అడుగడుగునా తమ భక్తిని వ్యక్తం చేశారు. చిన్నారులు నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

సోమందేపల్లి నుండి ఈద్గా వరకు సాగిన ఈ ర్యాలీకి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యస్‌ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించగా, ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా సమర్థంగా నియంత్రించారు.

మొత్తం మీద రంజాన్ ఆరంభ వేడుకలు సోమందేపల్లిలో ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో సాగాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News