Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుబలకు అండగా నిలుస్తాం: ఎంపీ నాగరాజు డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 04, 2026 06:31 PM

చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఆహ్వానం

చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఆహ్వానం

చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఆహ్వానం
March 19, 2026 02:58 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండలంలో తోగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం రేపు 20వ తేదీ తెల్లవారుజామున ఘనంగా నిర్వహించనున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగే ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా గురువారం ఆలయ ధర్మకర్త, మాజీ సర్పంచ్, మాస్టర్ వీవర్ డీ.సీ ఈశ్వరయ్య తన బృందంతో కలిసి సోమందేపల్లి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను కలిసి మహోత్సవానికి ఆహ్వానించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసి ఆశీస్సులు పొందాలని కోరారు.

అదేవిధంగా మహోత్సవం సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో శాంతి భద్రతల కోసం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను డీ.సీ ఈశ్వరయ్య వినతిపత్రం అందజేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఎస్‌ఐ హామీ ఇచ్చినట్లు సమాచారం.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News