Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మత్తుకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు భద్రం: ​డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం. సుమన్‌ కల్యాణ్‌ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 27, 2026 12:16 AM

చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఆహ్వానం

చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఆహ్వానం

చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌కు ఆహ్వానం
March 19, 2026 02:58 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండలంలో తోగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం రేపు 20వ తేదీ తెల్లవారుజామున ఘనంగా నిర్వహించనున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగే ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా గురువారం ఆలయ ధర్మకర్త, మాజీ సర్పంచ్, మాస్టర్ వీవర్ డీ.సీ ఈశ్వరయ్య తన బృందంతో కలిసి సోమందేపల్లి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను కలిసి మహోత్సవానికి ఆహ్వానించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసి ఆశీస్సులు పొందాలని కోరారు.

అదేవిధంగా మహోత్సవం సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో శాంతి భద్రతల కోసం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌ను డీ.సీ ఈశ్వరయ్య వినతిపత్రం అందజేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఎస్‌ఐ హామీ ఇచ్చినట్లు సమాచారం.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News