PRINT TIME: March 19, 2026 04:40 PM
చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్ఐ సుధాకర్ యాదవ్కు ఆహ్వానం
చౌడేశ్వరి జ్యోతుల మహోత్సవానికి ఎస్ఐ సుధాకర్ యాదవ్కు ఆహ్వానం
March 19, 2026 02:58 PM
1 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి మండలంలో తోగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం రేపు 20వ తేదీ తెల్లవారుజామున ఘనంగా నిర్వహించనున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని జరిగే ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం ఆలయ ధర్మకర్త, మాజీ సర్పంచ్, మాస్టర్ వీవర్ డీ.సీ ఈశ్వరయ్య తన బృందంతో కలిసి సోమందేపల్లి ఎస్ఐ సుధాకర్ యాదవ్ను కలిసి మహోత్సవానికి ఆహ్వానించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసి ఆశీస్సులు పొందాలని కోరారు.
అదేవిధంగా మహోత్సవం సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో శాంతి భద్రతల కోసం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్ఐ సుధాకర్ యాదవ్ను డీ.సీ ఈశ్వరయ్య వినతిపత్రం అందజేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఎస్ఐ హామీ ఇచ్చినట్లు సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి