PRINT TIME: July 10, 2026 09:52 PM
చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత
చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత
April 07, 2026 08:48 PM
255 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం చోలేమరి గ్రామంలో గ్రామ జాతర వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత టిడిపి నాయకుల ఆహ్వానం మేరకు జాతరలో పాల్గొన్నారు.
జాతరలో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, గ్రామ ప్రజలతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలోని నాయకుల ఇంటికి వెళ్లి ఏర్పాటు చేసిన విందులో పాల్గొని, వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి రాకతో చోలేమరి గ్రామంలో జాతర వేడుకలు మరింత ఉత్సాహంగా కొనసాగాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి