PRINT TIME: April 26, 2026 10:31 PM
వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం
వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం
April 26, 2026 08:38 PM
1 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
పెనుకొండ: వాసవీ మాత జయంతి సందర్భంగా పెనుకొండలోని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆర్చనలు నిర్వహించి భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు.
అమ్మవారి రథోత్సవాన్ని మంత్రి సవిత ప్రారంభించగా, స్థానికులు మరియు కులస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వేడుకల సందర్భంగా ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వాసవీ మాత ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి