రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు
రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతోఘనంగానిర్వహించబడిందిఈ సందర్భంగా వక్తగా పాల్గొన్న శ్రీమతి అనసుజా రెడ్డి (ఉత్తర కర్ణాటక దుర్గ వాహిని సంయోజిక) హిందూ ధర్మం, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని
పేర్కొన్నారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించి, యువత ధార్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మర్పల్లి రామ్ రెడ్డి (తెలంగాణ సహ సత్సంగ్ ప్రముఖ్) హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీ రామ్ చందర్ పవర్ (ప్రబంధ అధ్యక్షులు) పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులు “జై శ్రీరామ్” నినాదాలతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి