న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా:
చంద్రగ్రహణం సందర్భంగా న్యాల్కల్ గ్రామంలోని ప్రాచీన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రహణ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకొని హరినామ సంకీర్తనలో పాల్గొన్నారు. తాళాలు, వాద్యాల నాదంతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.
తబలా మాస్టర్ హనుమంతు, రామచందర్ పవర్, బక్కారెడ్డి, జక్కుల శ్రీనివాస్, నరసింహారెడ్డి పటేల్, బోడపల్లి శ్రీశైలం, గద నారాయణ, మెడికల్ అశోక్, ప్రభా రెడ్డి తదితరులు భజన కార్యక్రమంలో పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయం స్వయంభూ లింగాకారంతో ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి, కార్తీకమాసం, ప్రతి సోమవారం రోజున భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. చంద్రగ్రహణం సందర్భంగా నిర్వహించిన ఈ భజన కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించిందని భక్తులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి