Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి: టీజేఏ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 06:08 PM

డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా

డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా

డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా
March 29, 2026 04:03 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సందల్ ఊరేగింపులు, ఖవ్వాలి కార్యక్రమాలతో భక్తుల సందడి

గ్రామం: డప్పూర్

న్యాలకల్ మండలం డప్పూర్ గ్రామంలో జరుగుతున్న 186వ ఉర్సు షరీఫ్ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఉర్సు సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

మార్చి 29న రాత్రి 9 గంటలకు డప్పూర్ సందల్ కార్యక్రమం జరగనుంది. మార్చి 30న ఖురేషీ సందల్‌తో పాటు రాత్రి 9 గంటలకు ఖవ్వాలి కార్యక్రమం (సవాల్ జవాబ్) నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాల్లో ప్రముఖ ఖవ్వాలి గాయకులు అర్మాన్ ఎఫ్తేకార్ (నాందేడ్), రేష్మా తాజ్ (లక్నో) పాల్గొని భక్తులను అలరించనున్నారు. దర్గాలో చాదర్ సమర్పణ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.ఈ ఉత్సవానికి గ్రామాలు డప్పూర్, రత్నాపూర్, మల్గి, సుల్తాన్‌పూర్, వడ్డి, శంషాలాపూర్, అత్నూర్, న్యాల్‌కల్, చింగేపల్లి, షాపూర్ గేట్, కాప్లాపూర్ గ్రామాల నుండి భక్తులు విచ్చేస్తున్నారు.

ఉర్సు ముఖ్య కార్యక్రమాలు

మార్చి 29: డప్పూర్

సందల్ (రాత్రి 9 గం.)

మార్చి 30: ఖురేషీ సందల్ & ఖవ్వాలి కార్యక్రమం

ప్రముఖులు: అర్మాన్ ఎఫ్తేకార్, రేష్మా తాజ్

సభ్యుల కమిటీ:

విట్టల్ గౌడ్, అరుణ్ గౌడ్, Md. ఖాజా మియా, షేక్ ఐజాజ్, Md. గౌసుద్దీన్, Md. షకీల్, Md. అహ్మద్, Md. నబీ, మహమ్మద్ ముస్తాఖ్, మహమ్మద్ అజీముద్దీన్, బి. అరుణ్ గౌడ్, మహమ్మద్ మౌలానా, పి. నర్సిములు, మహమ్మద్ ఖదీర్, లక్ష్మణ్ సునర్, పి. సైఫుద్దీన్, సిహెచ్. మన్సూర్, అబ్దుల్ ఖదీర్, మహమ్మద్ మహితాబ్ సాహెబ్, హెచ్. సంగమేష్, పి. ప్రభు గొండా, షేక్ అర్షద్, కుమార్, మహమ్మద్ అమెర్,

ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి,




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News