డప్పూర్లో ఉర్సు మహోత్సవం ఘనంగా
డప్పూర్లో ఉర్సు మహోత్సవం ఘనంగా
Reporter Sangameshwar Reddy
సందల్ ఊరేగింపులు, ఖవ్వాలి కార్యక్రమాలతో భక్తుల సందడి
గ్రామం: డప్పూర్
న్యాలకల్ మండలం డప్పూర్ గ్రామంలో జరుగుతున్న 186వ ఉర్సు షరీఫ్ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఉర్సు సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
మార్చి 29న రాత్రి 9 గంటలకు డప్పూర్ సందల్ కార్యక్రమం జరగనుంది. మార్చి 30న ఖురేషీ సందల్తో పాటు రాత్రి 9 గంటలకు ఖవ్వాలి కార్యక్రమం (సవాల్ జవాబ్) నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాల్లో ప్రముఖ ఖవ్వాలి గాయకులు అర్మాన్ ఎఫ్తేకార్ (నాందేడ్), రేష్మా తాజ్ (లక్నో) పాల్గొని భక్తులను అలరించనున్నారు. దర్గాలో చాదర్ సమర్పణ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.ఈ ఉత్సవానికి గ్రామాలు డప్పూర్, రత్నాపూర్, మల్గి, సుల్తాన్పూర్, వడ్డి, శంషాలాపూర్, అత్నూర్, న్యాల్కల్, చింగేపల్లి, షాపూర్ గేట్, కాప్లాపూర్ గ్రామాల నుండి భక్తులు విచ్చేస్తున్నారు.
ఉర్సు ముఖ్య కార్యక్రమాలు
మార్చి 29: డప్పూర్
సందల్ (రాత్రి 9 గం.)
మార్చి 30: ఖురేషీ సందల్ & ఖవ్వాలి కార్యక్రమం
ప్రముఖులు: అర్మాన్ ఎఫ్తేకార్, రేష్మా తాజ్
సభ్యుల కమిటీ:
విట్టల్ గౌడ్, అరుణ్ గౌడ్, Md. ఖాజా మియా, షేక్ ఐజాజ్, Md. గౌసుద్దీన్, Md. షకీల్, Md. అహ్మద్, Md. నబీ, మహమ్మద్ ముస్తాఖ్, మహమ్మద్ అజీముద్దీన్, బి. అరుణ్ గౌడ్, మహమ్మద్ మౌలానా, పి. నర్సిములు, మహమ్మద్ ఖదీర్, లక్ష్మణ్ సునర్, పి. సైఫుద్దీన్, సిహెచ్. మన్సూర్, అబ్దుల్ ఖదీర్, మహమ్మద్ మహితాబ్ సాహెబ్, హెచ్. సంగమేష్, పి. ప్రభు గొండా, షేక్ అర్షద్, కుమార్, మహమ్మద్ అమెర్,
ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి,

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి