PRINT TIME: March 21, 2026 06:29 PM
రంజాన్ వీడ్కోలు సందర్భంగా జామియా మజీద్లో తే నీటి విందు
రంజాన్ వీడ్కోలు సందర్భంగా జామియా మజీద్లో తే నీటి విందు
March 21, 2026 04:34 PM
0 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి : పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా సోమందేపల్లి పట్టణంలోని జామియా మజీద్లో ముస్లిం సోదరులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జామియా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో తే నీటి విందు ఏర్పాటు చేశారు.
శుక్రవారం రాత్రి ఇషా నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ ప్రత్యేక ప్రార్థనలు (దువా) చేశారు. రంజాన్ నెలలో ఉపవాసాలు చేసిన ప్రతి ఒక్కరికీ శాంతి, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. అనంతరం ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని సోదరభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా భక్తులకు ఫలాలు, హరీర (పాయసం), సమోసాలు, బాదం పాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, యువకులు, మసీదు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి