Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 09:04 PM

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం
May 16, 2026 07:02 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం 2026-2027 ఆర్థిక సంవత్సరము మొట్టమొదటి సర్వసభ్య సమావేశం శనివారం (16-05-2026) మార్కెట్ చైర్మన్ పూల శివప్రసాద్ అధ్యక్షతన,సెక్రటరీ ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తచెరువు ఉప మార్కెట్ యార్డ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ యొక్క అభివృద్ధి పనులు

షాపింగ్ కాంప్లెక్స్, రోడ్డు సౌకర్యాలు, రైతులు పంట ఆరబెట్టుకోవడానికి ఫ్లాట్ ఫారం, పెండింగ్లో ఉన్న గోదాము యొక్క పైకప్పు,ఇతర అభివృద్ధి పనులపై

చర్చించడం జరిగింది. వీటి అనుమతుల విషయంలో మార్కెటింగ్ JD మరియు కమిషనర్ల ఆధ్వర్యంలో అవుతున్నందున వాటిని వీలైనంత త్వరగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సహకారంతో త్వరగా అనుమతులు పొందే విధంగా కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు సహకరించవలసిందిగా కోరారు. అదే విధంగా కొత్తచెరువు మార్కెట్ యార్డ్ లో *స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర* కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పాల్గొని మన పరిసరాలను శుభ్రంగా ఉంచవలసిందిగా ప్రతిజ్ఞ చేసి స్వచ్చత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు నిజాంవలి, సురేష్, నంజప్ప, జయరాం నాయక్, మణి కుమారి, పూల గోవర్ధన్, జయశ్రీ, హేమావతి సుధీర్, విజయ్ కుమార్ మరియు మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News