విశాఖపట్నం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విచ్చేసిన ఆమె, విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ ‘డేగా’లో దిగారు.
రాష్ట్రపతి రాకతో ఎయిర్ స్టేషన్ పరిసరాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సందడిగా మారాయి. గార్డ్ ఆఫ్ ఆనర్తో రాష్ట్రపతికి సైనిక సత్కారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేయగా, అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి