స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు కార్యాచరణ జిల్లా కలెక్టరేట్లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు కార్యాచరణ జిల్లా కలెక్టరేట్లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
Anjali
శ్రీ సత్య సాయి జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్వర్ణ ఆంధ్ర 2047’ విజన్ ప్రణాళికలో భాగంగా రూపొందించిన నూతన క్యాలెండర్ను జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
విజన్కు అనుగుణంగా రూపొందించిన ఈ క్యాలెండర్ జిల్లా స్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, ఎస్డీసీ రామసుబ్బయ్య, పీడీ డీఆర్డీఏ నరసయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి