Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:42 AM

స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు కార్యాచరణ జిల్లా కలెక్టరేట్‌లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు కార్యాచరణ జిల్లా కలెక్టరేట్‌లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

స్వర్ణ ఆంధ్ర–2047 లక్ష్యాలకు కార్యాచరణ  జిల్లా కలెక్టరేట్‌లో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
February 23, 2026 05:31 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్వర్ణ ఆంధ్ర 2047’ విజన్ ప్రణాళికలో భాగంగా రూపొందించిన నూతన క్యాలెండర్‌ను జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

విజన్‌కు అనుగుణంగా రూపొందించిన ఈ క్యాలెండర్ జిల్లా స్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో డీఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, ఎస్‌డీసీ రామసుబ్బయ్య, పీడీ డీఆర్‌డీఏ నరసయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News