పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం
పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమను టూరిజం హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా పెనుకొండలో పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పెనుకొండ కొండపై రూ.450 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రూ.4 కోట్లతో రెండు ఎకో పార్కులు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్లో త్వరలో బోటింగ్ ప్రారంభించడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రాంతానికి ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని మంత్రి సవిత తెలిపారు. తిమ్మరుసు సమాధి సమీపంలో ఫారెస్ట్ టోల్ గేట్ను ప్రారంభించి భద్రతను మెరుగుపరిచారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి