Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం பதவியேற்கும் முன்பே விஜய் அதிரடி தீர்மானம்! డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 07:11 PM

పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం

పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం

పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం
May 06, 2026 05:53 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా పెనుకొండలో పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు.


పెనుకొండ కొండపై రూ.450 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రూ.4 కోట్లతో రెండు ఎకో పార్కులు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో త్వరలో బోటింగ్ ప్రారంభించడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.


పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రాంతానికి ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని మంత్రి సవిత తెలిపారు. తిమ్మరుసు సమాధి సమీపంలో ఫారెస్ట్ టోల్ గేట్‌ను ప్రారంభించి భద్రతను మెరుగుపరిచారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News