Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:11 AM

పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం

పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం

పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం
06-05-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా పెనుకొండలో పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు.


పెనుకొండ కొండపై రూ.450 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రూ.4 కోట్లతో రెండు ఎకో పార్కులు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో త్వరలో బోటింగ్ ప్రారంభించడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.


పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రాంతానికి ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని మంత్రి సవిత తెలిపారు. తిమ్మరుసు సమాధి సమీపంలో ఫారెస్ట్ టోల్ గేట్‌ను ప్రారంభించి భద్రతను మెరుగుపరిచారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Sthanikam

పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా పెనుకొండలో పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు.


పెనుకొండ కొండపై రూ.450 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రూ.4 కోట్లతో రెండు ఎకో పార్కులు నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో త్వరలో బోటింగ్ ప్రారంభించడంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.


పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రాంతానికి ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని మంత్రి సవిత తెలిపారు. తిమ్మరుసు సమాధి సమీపంలో ఫారెస్ట్ టోల్ గేట్‌ను ప్రారంభించి భద్రతను మెరుగుపరిచారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News