Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు బూదిలి హైస్కూల్ అభివృద్ధి పనులకు భూమి పూజ – జలధార కార్యక్రమం ప్రారంభం 5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 04:23 PM

5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్
April 26, 2026 02:43 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

హిందూపూర్ పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. సభలో సెన్సస్ యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు.ఈ 5K రన్ గాంధీ సర్కిల్ నుండి ప్రారంభమై, పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి తెలుగు తల్లి విగ్రహం వద్ద ముగిసింది.ప్రజలందరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించే భవిష్యత్తు ప్రణాళికలు మరియు ప్రాజెక్టులకు ఈ గణాంకాలే మూలాధారమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న తొలి దశలో ప్రతి ఇల్లు, వీధి మరియు గ్రామ పరిధిలోని గృహాల వివరాలను నమోదు చేస్తున్నారు.2027 ఫిబ్రవరిలో జరిగే పాపులేషన్ సెన్సస్ ద్వారా కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు మరియు కుల గణన చేపట్టడం జరుగుతుంది.ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సెన్సస్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.రాబోయే 'జనాభా గణన 2027' అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని జనాభా గణన ప్రాముఖ్యతను వివరించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు జనాభా గణనపై వకృత్వ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ విజేతలుగా ఎంపిక చేయడం జరిగింది.విజేతలకు ఈ కార్యక్రమంలో భాగంగా జ్ఞాపికలు (మెమెంటోలు) అందజేశారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై అవగాహన పెంచడం విశేషం అని కలెక్టర్ పెర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు వీరయ్య, బాలాజీ,హిందూపూర్ మున్సిపల్ కమిషనర్మల్లికార్జున,ఆర్డీఓ ఆనంద్ కుమార్, డిఎస్పి మహేష్,తహశీల్దార్ వెంకటేశు,మడకశిర తహసీల్దార్ మైనుద్దీన్, మరియు ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News