Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:16 AM

ఓడిసి లో ఘనంగా రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ

ఓడిసి లో ఘనంగా రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ

ఓడిసి లో ఘనంగా రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ
18-05-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు,రేనాటి వీరుడు, బహుజన పోరాట యోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఓడిసి మండల కేంద్రంలోని హైవే కూడలిలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఓడిసి మండల వడ్డెర సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా వడ్డెర కులస్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది వేముల బేబీరాణి, తదితర ప్రముఖులు ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వడ్డే ఓబన్న స్వాతంత్ర పోరాటంలో గిరిల్ల యుద్ధ తంత్రంతో బ్రిటిష్ సైన్యాన్ని తుద ముట్టించిన పోరాటయోధుడని కొనియాడారు.అణగారిన వర్గాల హక్కుల కోసం ఓబన్న చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. వడ్డెర కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి పల్లె పేర్కొన్నారు. అనంతరం సభలో టిడిపి మాజీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజనప్ప, ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప ప్రసంగించారు. వడ్డే ఓబన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, ఆయన సేవలను భావితరాలకు తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబన్న విగ్రహ దాత డేరంగుల రవీంద్ర, మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ, రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శులు ఎల్ఐసి నరసింహులు, దేవుళ్ళ మురళి, సామకోటి ఆదినారాయణ, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఒలిపి శ్రీనివాసులు, జిల్లా వడ్డెర సాధికారిత కన్వీనర్ పల్లపు రవీంద్ర, పల్లపు జయచంద్ర, మల్లెల జయరాం, ఓసిసిసిఐ జాతీయ అధ్యక్షులు గొడ్డువెలగల వెంకటేష్, డిఎస్పీ వేణుగోపాల్, టీడీపి జిల్లా అధికార ప్రతినిధి సోమశేఖర్, వైసిపి రాష్ట్ర నాయకులు రేపన ముని, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు మస్తానమ్మ, అమర్నాథ్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓడిసి లో ఘనంగా రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ

Article Image

తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు,రేనాటి వీరుడు, బహుజన పోరాట యోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఓడిసి మండల కేంద్రంలోని హైవే కూడలిలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఓడిసి మండల వడ్డెర సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా వడ్డెర కులస్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది వేముల బేబీరాణి, తదితర ప్రముఖులు ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వడ్డే ఓబన్న స్వాతంత్ర పోరాటంలో గిరిల్ల యుద్ధ తంత్రంతో బ్రిటిష్ సైన్యాన్ని తుద ముట్టించిన పోరాటయోధుడని కొనియాడారు.అణగారిన వర్గాల హక్కుల కోసం ఓబన్న చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. వడ్డెర కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాజీ మంత్రి పల్లె పేర్కొన్నారు. అనంతరం సభలో టిడిపి మాజీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజనప్ప, ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమప్ప ప్రసంగించారు. వడ్డే ఓబన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, ఆయన సేవలను భావితరాలకు తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబన్న విగ్రహ దాత డేరంగుల రవీంద్ర, మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ, రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శులు ఎల్ఐసి నరసింహులు, దేవుళ్ళ మురళి, సామకోటి ఆదినారాయణ, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఒలిపి శ్రీనివాసులు, జిల్లా వడ్డెర సాధికారిత కన్వీనర్ పల్లపు రవీంద్ర, పల్లపు జయచంద్ర, మల్లెల జయరాం, ఓసిసిసిఐ జాతీయ అధ్యక్షులు గొడ్డువెలగల వెంకటేష్, డిఎస్పీ వేణుగోపాల్, టీడీపి జిల్లా అధికార ప్రతినిధి సోమశేఖర్, వైసిపి రాష్ట్ర నాయకులు రేపన ముని, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు మస్తానమ్మ, అమర్నాథ్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News