చింతలపూడి లో నూతనంగా నిర్మించనున్న నగరవనంలో వినోద భరితంగా, అమేజింగ్ గా ఉండే విధంగా రూపొందించాలని శాసనసభ్యులు
సొంగా రోషన్ కుమార్ ముఖ్యమంత్రి సలహాదారు, మాజీ చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్ కే. మల్లికార్జున రావు ను కోరారు. సచివాలయంలో మల్లికార్జున్ రావు ని కలిసి పార్కులో ఏర్పాటు చేయవలసిన విభాగాలు ఇతర సౌకర్యాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. చింతలపూడిలోని నగరవనం మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా అన్ని వర్గాల వారికి వినోదం అందించే విధంగా సందర్శకుల అభిరుచికి అనుగుణంగా కొత్త హంగులతో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రూపొందించాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచనకు మల్లికార్జున్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫున తాము అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేస్తూ ఆ విధమైన ఆలోచన విధానం అభినందనీయమని మల్లికార్జున్ పేర్కొన్నారు. అందుకు సహకరించిన జిల్లా ఫారెస్ట్ అధికారిణి సందీప్ రెడ్డి కి మల్లికార్జున్ కి శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి