నల్లగొండ, స్థానిక ప్రతినిధి: నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన వెన్నెల జ్యూయలరీ–శారీస్ షాపును శుక్రవారం నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహిళలకు అవసరమైన జ్యూయలరీతో పాటు పట్టు వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్ను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. వెండి, బంగారు ఆభరణాలను ఎలాంటి తరుగు, మేకింగ్ చార్జీలు లేకుండా విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించడం, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఘనంగా అతిథుల సన్మానం.
షాపు ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, నల్లగొండ మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్రెడ్డి, ఏదుళ్ల మధుసూదన్రెడ్డి, కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్ హాజీ, యమ కవితా దయాకర్, మాజీ కౌన్సిలర్లు ఖయ్యూం బేగ్, ఫసాహత్ అలీ బాబా, వెన్నెల సారీస్ అధినేత చొక్కారపు వెంకన్న, మాధవి, సాయి నిఖిల్, వెన్నెల, మిర్యాల దేవేందర్, వినోద్, భజరంగ్, నిర్మల, ప్రీతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి