రామన్నపేట: మండలంలోని ఉత్తట్టూరు గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కమిటీ హాల్ వద్ద ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు మేడి రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడి రాజు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేడి నరసింహ, మేడి శ్రీనివాస్, కోళ్ల పుల్లయ్య, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రముఖులు, యువకులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి