రిజిస్ట్రేషన్ తర్వాత తొలిసారిగా జెండా ఆవిష్కరణ.
హయత్నగర్:
శ్రీ వినాయకనగర్ కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కాలనీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవడంతో కాలనీవాసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
దేశభక్తి నినాదాలతో మార్మోగిన కాలనీ
దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలను చాటుతూ చిన్నారులు, మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పలువురు పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు డి. లింగం, సభ్యులు భీమ్రావు, కనకారావు, వేణుగోపాల్, లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి, చరణ్, శేఖర్రెడ్డి, రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జైహింద్.. వందేమాతరం నినాదాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి