సరూర్నగర్: సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీశైలం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది జాతీయ జెండాకు సెల్యూట్ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా సీఐ శ్రీశైలం మాట్లాడుతూ దేశ ఐక్యత, రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు శక్తివంచన లేకుండా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ప్రజల భద్రతకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి