ఎలుక రాజు ఉపేందర్ చిన్న కొండూరు సిపిఎం పార్టీ నాయకులు
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా సీపీఎం నాయకులు ఏలుకరాజు ఉపేందర్ చిన్నకొండూరు ప్రాథమిక పాఠశాలకు ఉచితంగా కుర్చీలను అందజేసి తన సేవా నిరతిని చాటుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠశాలకు అవసరమైన సామగ్రిని బహూకరించడం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు.ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అలాగే, శిథిలావస్థకు చేరిన చిన్నకొండూరు ప్రాథమిక పాఠశాల పాత భవనాన్ని తొలగించి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్యాబోధన జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తున్న సర్కారు బడుల అభివృద్ధికి సమాజం బాధ్యతగా ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వేముల రమాదేవి, ఉపాధ్యాయులు కె. శిరీష, ఎ. క్రాంతి, నాయకులు మారుపాక భాస్కర్, ఎస్ఎంసీ చైర్మన్ గడ్డం మంజుల సత్తయ్య, చెరుకు రమేష్ గౌడ్, తిగుళ్ల బిక్షపతి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి