ప్రజావాణి, భూభారతిలో ఉత్తమ సేవలకు గుర్తింపు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ డి.అసిస్టెంట్గా గత మూడున్నరేళ్లుగా విధులు నిర్వహిస్తున్న డి.స్రవంతికి ప్రతిభా పురస్కారం లభించింది. ప్రజావాణి కార్యక్రమంతో పాటు భూభారతి, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రజలకు సేవలందించినందుకు ఆమెకు ఈ పురస్కారం దక్కింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పురస్కారం.
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి గుత్తా సుఖేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి చేతుల మీదుగా జూనియర్ అసిస్టెంట్ డి.స్రవంతి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.
సేవలకు లభించిన గుర్తింపు.
ప్రజావాణి, భూభారతి, ప్రభుత్వ భూములకు సంబంధించిన పనుల్లో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలు అందించినందుకు స్రవంతిని అధికారులు అభినందించారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యత పెంచిందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని డి.స్రవంతి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి