నల్లగొండ: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో నల్లగొండలో సీపీఎం నాయకుడు ఎండి సలీంను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సీపీఎం నేత సలీంను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకు ముందే నాయకులను అదుపులోకి తీసుకోవడంపై సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజునే అరెస్టులా?
అంటూ పోలీసుల తీరును సీపీఎం నాయకులు ప్రశ్నించారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన వారు.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టు చేసినట్లు పోలీసుల వర్గాలు భావిస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై సీపీఎం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నల్లగొండలో రాజకీయ వర్గాల్లో ఈ ముందస్తు అరెస్టు చర్చనీయాంశంగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి