Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ వేళ సీపీఎం నేత ముందస్తు అరెస్ట్ పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 11:34 AM

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ వేళ సీపీఎం నేత ముందస్తు అరెస్ట్

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ వేళ సీపీఎం నేత ముందస్తు అరెస్ట్

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ వేళ సీపీఎం నేత ముందస్తు అరెస్ట్
15-08-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో నల్లగొండలో సీపీఎం నాయకుడు ఎండి సలీంను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

సీపీఎం నేత సలీంను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకు ముందే నాయకులను అదుపులోకి తీసుకోవడంపై సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


స్వాతంత్ర్య దినోత్సవం రోజునే అరెస్టులా?

అంటూ పోలీసుల తీరును సీపీఎం నాయకులు ప్రశ్నించారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన వారు.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టు చేసినట్లు పోలీసుల వర్గాలు భావిస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై సీపీఎం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నల్లగొండలో రాజకీయ వర్గాల్లో ఈ ముందస్తు అరెస్టు చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ వేళ సీపీఎం నేత ముందస్తు అరెస్ట్

Article Image

నల్లగొండ: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో నల్లగొండలో సీపీఎం నాయకుడు ఎండి సలీంను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

సీపీఎం నేత సలీంను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకు ముందే నాయకులను అదుపులోకి తీసుకోవడంపై సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


స్వాతంత్ర్య దినోత్సవం రోజునే అరెస్టులా?

అంటూ పోలీసుల తీరును సీపీఎం నాయకులు ప్రశ్నించారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన వారు.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అరెస్టు చేసినట్లు పోలీసుల వర్గాలు భావిస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై సీపీఎం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నల్లగొండలో రాజకీయ వర్గాల్లో ఈ ముందస్తు అరెస్టు చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News