: రామన్నపేట మండలంలోని ఇద్రపాలనగర్ గ్రామంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. నాగార్జున స్కూల్కు చెందిన స్కూల్ బస్సు TS30T5502 ఢీకొనడంతో 18 నెలల చిన్నారి అభిజ్ఞతార అక్కడికక్కడే మృతిచెందింది.
గ్రామానికి చెందిన వీర్లపల్లి మురళి–ఎల్లేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతురాలు చిన్న కుమార్తెగా కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
స్కూల్ బస్సు కదులుతున్న సమయంలో చిన్నారి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి