Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామ్‌నగర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 01:20 PM

నల్లగొండ నా ఊపిరి మీ కోసం నా శ్వాస ఉన్నంతవరకు శ్రమిస్తా.!

నల్లగొండ నా ఊపిరి మీ కోసం నా శ్వాస ఉన్నంతవరకు శ్రమిస్తా.!

నల్లగొండ నా ఊపిరి మీ కోసం నా శ్వాస ఉన్నంతవరకు శ్రమిస్తా.!
15-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


నల్లగొండను అగ్రభాగాన నిలబెట్టడమే నా లక్ష్యం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..

పట్టణ తాగునీటి ప్రాజెక్టుకు రూ.83 కోట్లతో శంకుస్థాపన..

అదనంగా మరో రూ.300 కోట్ల అభివృద్ధి నిధుల మంజూరు..

నల్లగొండ: "నల్లగొండ అంటేనే పోరాటం, త్యాగం, తిరుగుబాటు, ఆత్మగౌరవానికి ప్రతీక నల్లగొండ నా ఊపిరి.. నా శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడతా" అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటి కష్టాలు తీర్చి, నల్లగొండను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఏనాటికీ శాశ్వతం కాదని, ప్రజల కోసం చేసే పోరాటాలు, అందించే సేవలే చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు.

సంక్షేమంలో ముందంజ..

​జిల్లాలో అమలువుతున్న సంక్షేమ పథకాల పురోగతిని వివరిస్తూ..​రైతు భరోసా ధ్వార జిల్లాలోని 5.35 లక్షల మంది రైతులకు రూ.715 కోట్ల నిధులను అందించినట్లు తెలిపారు. ​ఆసరా పింఛన్లు ను 1.99 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు రూ.51.28 కోట్ల పింఛన్ల తో చేయూతనిస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తో  జిల్లాకు 17,873 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 4,360 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. గృహజ్యోతి తో 2.56 లక్షల కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుల లబ్ధి పొందుతున్నాయని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 38,403 మంది పేదలకు రూ.119.11 కోట్ల విలువైన వైద్య సేవలు అందాయని తెలిపారు.

రూ.83 కోట్లతో 24 గంటల తాగునీటి ప్రాజెక్టు..

​నల్లగొండ పట్టణ ప్రజలకు 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.83 కోట్లతో చేపడుతున్న వాటర్ ప్రాజెక్టుకు మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణ రూపురేఖలు మార్చేందుకు అదనంగా మరో రూ.300 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రూ.20 కోట్లతో ఎన్ఏసీ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మించనున్నట్లు వెల్లడించారు. పోరాటాల గడ్డగా పేరుగాంచిన నల్లగొండను అభివృద్ధికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే తన ఆశయమని మంత్రి కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు.


Sthanikam

నల్లగొండ నా ఊపిరి మీ కోసం నా శ్వాస ఉన్నంతవరకు శ్రమిస్తా.!

Article Image


నల్లగొండను అగ్రభాగాన నిలబెట్టడమే నా లక్ష్యం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..

పట్టణ తాగునీటి ప్రాజెక్టుకు రూ.83 కోట్లతో శంకుస్థాపన..

అదనంగా మరో రూ.300 కోట్ల అభివృద్ధి నిధుల మంజూరు..

నల్లగొండ: "నల్లగొండ అంటేనే పోరాటం, త్యాగం, తిరుగుబాటు, ఆత్మగౌరవానికి ప్రతీక నల్లగొండ నా ఊపిరి.. నా శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడతా" అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటి కష్టాలు తీర్చి, నల్లగొండను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు. అధికారం ఏనాటికీ శాశ్వతం కాదని, ప్రజల కోసం చేసే పోరాటాలు, అందించే సేవలే చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు.

సంక్షేమంలో ముందంజ..

​జిల్లాలో అమలువుతున్న సంక్షేమ పథకాల పురోగతిని వివరిస్తూ..​రైతు భరోసా ధ్వార జిల్లాలోని 5.35 లక్షల మంది రైతులకు రూ.715 కోట్ల నిధులను అందించినట్లు తెలిపారు. ​ఆసరా పింఛన్లు ను 1.99 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు రూ.51.28 కోట్ల పింఛన్ల తో చేయూతనిస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తో  జిల్లాకు 17,873 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 4,360 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. గృహజ్యోతి తో 2.56 లక్షల కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుల లబ్ధి పొందుతున్నాయని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 38,403 మంది పేదలకు రూ.119.11 కోట్ల విలువైన వైద్య సేవలు అందాయని తెలిపారు.

రూ.83 కోట్లతో 24 గంటల తాగునీటి ప్రాజెక్టు..

​నల్లగొండ పట్టణ ప్రజలకు 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.83 కోట్లతో చేపడుతున్న వాటర్ ప్రాజెక్టుకు మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణ రూపురేఖలు మార్చేందుకు అదనంగా మరో రూ.300 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు రూ.20 కోట్లతో ఎన్ఏసీ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మించనున్నట్లు వెల్లడించారు. పోరాటాల గడ్డగా పేరుగాంచిన నల్లగొండను అభివృద్ధికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే తన ఆశయమని మంత్రి కోమటిరెడ్డి పునరుద్ఘాటించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News