Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 60 శాతం దళితులకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం....... పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 07:21 AM

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రావణ సంబరం.....

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రావణ సంబరం.....

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రావణ సంబరం.....
15-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

పవిత్ర శ్రావణ మాస ఆరంభాన్ని పురస్కరించుకుని శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నుంచి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలతో భక్తులు పెద్ద ఎత్తున నగర సంకీర్తన చేపట్టారు.

పట్టణంలోని ప్రధాన రహదారి గుండా మంగళవాయిద్యాలు, భజన కీర్తనల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయంలో అమ్మవార్లకు మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం పోసి, చీరసారెలతో పాటు పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు. శ్రావణ మాస మొదటి రోజు కావడంతో ఆలయం భక్తజనసందోహంతో కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకూరి అంజయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు......

Sthanikam

వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రావణ సంబరం.....

Article Image

పవిత్ర శ్రావణ మాస ఆరంభాన్ని పురస్కరించుకుని శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నుంచి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలతో భక్తులు పెద్ద ఎత్తున నగర సంకీర్తన చేపట్టారు.

పట్టణంలోని ప్రధాన రహదారి గుండా మంగళవాయిద్యాలు, భజన కీర్తనల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయంలో అమ్మవార్లకు మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం పోసి, చీరసారెలతో పాటు పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు. శ్రావణ మాస మొదటి రోజు కావడంతో ఆలయం భక్తజనసందోహంతో కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకూరి అంజయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News