పవిత్ర శ్రావణ మాస ఆరంభాన్ని పురస్కరించుకుని శుక్రవారం కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం నుంచి దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలతో భక్తులు పెద్ద ఎత్తున నగర సంకీర్తన చేపట్టారు.
పట్టణంలోని ప్రధాన రహదారి గుండా మంగళవాయిద్యాలు, భజన కీర్తనల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయంలో అమ్మవార్లకు మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం పోసి, చీరసారెలతో పాటు పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించారు. శ్రావణ మాస మొదటి రోజు కావడంతో ఆలయం భక్తజనసందోహంతో కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జూకూరి అంజయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు......

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి