కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ.
చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో శ్రీ కనకదుర్గ ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు గుంజ కృష్ణ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.
అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి, దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, ఐక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి