R&B కార్యాలయంలో గాంధీ చిత్రపటానికే మాల.. అంబేద్కర్ చిత్రపటాన్ని విస్మరించడంపై విమర్శలు.
గ్రంథాలయం వద్ద చినిగిన జెండా ఎగురవేత.. చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్
రామన్నపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలోని R&B కార్యాలయం వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మాల వేయకుండా కేవలం మహాత్మా గాంధీ చిత్రపటానికే మాల వేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎండీ పజల్ బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ చిత్రపటానికి గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. దేశ రాజ్యాంగ నిర్మాతకు కనీస గౌరవం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదన్నారు.
అదేవిధంగా రామన్నపేట గ్రంథాలయం వద్ద చినిగిన జాతీయ జెండాను ఎగురవేయడం దేశ జెండాను అవమానించడమేనని పజల్ బేగ్ విమర్శించారు. దేశానికి, జాతీయ జెండాకు ఇస్తున్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.
ఈ ఘటనలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల శాఖ అధ్యక్షులు ఎండీ పజల్ బేగ్ డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి