జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ మన్మధ కుమార్
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత వేడుకగా, ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి, సగౌరవంగా వందనం సమర్పించారు.ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ... స్టేషన్ అధికారులకు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో, ప్రజా సేవలో పోలీసు వ్యవస్థ వహిస్తున్న పాత్ర వర్ణనాతీతమన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మసలుకుంటూ, ప్రజల భద్రతే ధ్యేయంగా నిరంతరం అంకితభావంతో విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విశేష సంఖ్యలో పాల్గొని, జాతీయ సమైక్యతను, నిండైన దేశభక్తిని చాటుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి