యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆదర్శ్ అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంకు లింగయ్య, రాపోలు రమేష్, ఈసం గాలయ్య, ఏకుల రామస్వామి, ఏకుల మల్లేష్, భాష్మల్ల ప్రభుదాస్, కృపాకర్, రాపోలు ప్రకాష్, ఆకాష్, బెల్లం మల్లేష్, నానివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, వార్డు సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, దేశభక్తి, ఐక్యతా భావాలను చాటారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి