అందుబాటులోకి నూతన ట్రాఫిక్ పిఎస్: ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వైపున నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంగణానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను శనివారం అధికారికంగా తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ డిఎస్పీ ప్రభాకర్ రెడ్డిల ప్రత్యక్ష పర్యవేక్షణ, సూచనలతో ఈ కొత్త కార్యాలయ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. సిబ్బందికి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త ప్రాంగణం అందుబాటులోకి రావడంతో వాహనదారులకు, స్థానిక ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన ట్రాఫిక్ సేవలు అందించడానికి మార్గం సుగమమైంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి