Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 04:59 PM

చాట్రాయిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి టీడీపీ నేత మందపాటి బసవా రెడ్డి

చాట్రాయిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి టీడీపీ నేత మందపాటి బసవా రెడ్డి

చాట్రాయిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి టీడీపీ నేత మందపాటి బసవా రెడ్డి
March 16, 2026 03:17 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ఈ సీజన్‌లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు వచ్చి సిద్ధంగా ఉందని, అయితే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే మార్కెట్ యార్డు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చేతికొచ్చిన పంటను తక్కువ ధరలకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని,

ఈ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు మందపాటి బసవారెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మార్కెట్ యార్డును ప్రారంభించి మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సానుకూలంగా స్పందించారు. రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. రైతులు కూడా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుని తగిన ధరకు పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News