Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:55 AM

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
25-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు, : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 129 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని క్రిష్ణగిరి మండలం ఆగవెల్లి గ్రామానికి చెందిన లింగన్న ఫిర్యాదు చేశారు. గృహ రుణం విషయంలో మోసపోయామని కోడుమూరుకు చెందిన కర్ణ గోపాల్ వినతి ఇచ్చారు. అలాగే కూరగాయల బంకు ఆక్రమణ, ట్రాక్టర్ తీసుకుని పరారైన ఘటన, ఇల్లు ఆక్రమించే ప్రయత్నం, భూమి విక్రయంలో మోసం వంటి ఫిర్యాదులు కూడా అందాయి.

ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు రామయ్య నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

Article Image

కర్నూలు, : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 129 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని క్రిష్ణగిరి మండలం ఆగవెల్లి గ్రామానికి చెందిన లింగన్న ఫిర్యాదు చేశారు. గృహ రుణం విషయంలో మోసపోయామని కోడుమూరుకు చెందిన కర్ణ గోపాల్ వినతి ఇచ్చారు. అలాగే కూరగాయల బంకు ఆక్రమణ, ట్రాక్టర్ తీసుకుని పరారైన ఘటన, ఇల్లు ఆక్రమించే ప్రయత్నం, భూమి విక్రయంలో మోసం వంటి ఫిర్యాదులు కూడా అందాయి.

ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు రామయ్య నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News