చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
Editor Desk
కర్నూలు, : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 129 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని క్రిష్ణగిరి మండలం ఆగవెల్లి గ్రామానికి చెందిన లింగన్న ఫిర్యాదు చేశారు. గృహ రుణం విషయంలో మోసపోయామని కోడుమూరుకు చెందిన కర్ణ గోపాల్ వినతి ఇచ్చారు. అలాగే కూరగాయల బంకు ఆక్రమణ, ట్రాక్టర్ తీసుకుని పరారైన ఘటన, ఇల్లు ఆక్రమించే ప్రయత్నం, భూమి విక్రయంలో మోసం వంటి ఫిర్యాదులు కూడా అందాయి.
ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు రామయ్య నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి