Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:58 PM

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
May 25, 2026 04:41 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు, : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు చట్టపరంగా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 129 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని క్రిష్ణగిరి మండలం ఆగవెల్లి గ్రామానికి చెందిన లింగన్న ఫిర్యాదు చేశారు. గృహ రుణం విషయంలో మోసపోయామని కోడుమూరుకు చెందిన కర్ణ గోపాల్ వినతి ఇచ్చారు. అలాగే కూరగాయల బంకు ఆక్రమణ, ట్రాక్టర్ తీసుకుని పరారైన ఘటన, ఇల్లు ఆక్రమించే ప్రయత్నం, భూమి విక్రయంలో మోసం వంటి ఫిర్యాదులు కూడా అందాయి.

ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు రామయ్య నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News