Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లైబ్రరీలు విజ్ఞాన భాండాగారాలు. పుస్తక పఠనంతో చరిత్రపై అవగాహన పెరుగుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం సత్యసాయి తాగునీటి కార్మికులకు వైసీపీ మద్దతు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ லஞ்ச் பாக்ஸுடன் செயலகத்திற்கு முதல்வர் விஜய்.. சாதாரண ஊழியரைப் போல புதிய பணிமுறை వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 08:13 PM

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత
May 16, 2026 07:23 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

431 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, మరో ఇద్దరు పరార్

రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ (ఆర్‌ఎన్‌పీఎస్) బృందం, చౌటుప్పల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పంతంగి టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న TS07GM 4617 నంబర్‌ (నకిలీ నంబర్ ప్లేట్) గల మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసే సమయంలో అందులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో సుమారు 431 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 5 కిలోల చొప్పున 83 ప్యాకెట్లు, 2 కిలోల చొప్పున 8 ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల విచారణలో నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని, రాజమండ్రి ప్రాంతంలో రాకేష్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని సేకరించి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించినట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న నిందితులు సలీమ్ (34), అమన్ (22)గా గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా లిషాడి గ్రామానికి చెందినవారని తెలిపారు. కేసులో అమీర్ుద్దీన్, ఫిరోజ్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.చౌటుప్పల్ పోలీసుల సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News