రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలోని అవుసలోని కుంట వద్ద గ్రామపంచాయతీకి చెందిన బోర్మోటార్ పూర్తిగా చెడిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తక్షణ చర్యలు చేపట్టారు.
పాడైన మోటార్ స్థానంలో నూతన మోటార్ను అమర్చించి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. దీంతో గ్రామ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా పరిష్కారం కల్పించినట్లు గ్రామస్థులు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ చూపడం అభినందనీయమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి