రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండల భాచేపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పచ్చిరొట్టె జిలుగు, జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, భూసార పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి జిలుగు, జనుము వంటి పచ్చిరొట్టె పంటలను సాగు చేసి పూత దశలో భూమిలో కలియదున్నడం వల్ల భూమికి అవసరమైన నత్రజని, సేంద్రీయ కర్బనం సహజసిద్ధంగా లభించి భూసారం పెరుగుతుందని తెలిపారు. దీని వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. రాబోయే వానాకాలం సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, రుణాలు సకాలంలో అందిస్తూ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని రైతులందరూ ఈ సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకుని సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని కోరారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లు, వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి