Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:56 PM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి
May 25, 2026 08:36 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మండల భాచేపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పచ్చిరొట్టె జిలుగు, జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం, భూసార పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి జిలుగు, జనుము వంటి పచ్చిరొట్టె పంటలను సాగు చేసి పూత దశలో భూమిలో కలియదున్నడం వల్ల భూమికి అవసరమైన నత్రజని, సేంద్రీయ కర్బనం సహజసిద్ధంగా లభించి భూసారం పెరుగుతుందని తెలిపారు. దీని వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. రాబోయే వానాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, రుణాలు సకాలంలో అందిస్తూ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని రైతులందరూ ఈ సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకుని సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని కోరారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్లు, వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News