Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:52 PM

కల్హేర్ మండల సమాఖ్య కార్యాలయంలో బాల్య వివాహాలపై కిషోర బాలికలకు అవగాహన

కల్హేర్ మండల సమాఖ్య కార్యాలయంలో బాల్య వివాహాలపై కిషోర బాలికలకు అవగాహన

కల్హేర్ మండల సమాఖ్య కార్యాలయంలో బాల్య వివాహాలపై కిషోర బాలికలకు అవగాహన
May 26, 2026 03:48 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల కేంద్రంలో ఉన్న మండల సమాఖ్య కార్యాలయంలో మంగళవారం 99 రోజుల ప్రణాళికలో భాగంగా స్నేహ సంఘాల సభ్యులు, కిషోర బాలికలకు బాల్య వివాహాల నివారణ మరియు మహిళా, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్హేర్ ఎస్సై రవిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. చిన్న వయస్సులో వివాహాలు చేయడం చట్ట విరుద్ధమని, అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.అలాగే బాలికలు విద్యపై దృష్టి పెట్టి తమ లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రభుత్వం బాలికల రక్షణ కోసం అమలు చేస్తున్న చట్టాలు, షీ టీమ్స్ సేవలు, మహిళా హెల్ప్‌లైన్, చైల్డ్ హెల్ప్‌లైన్ వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. బాలల హక్కులు, ఆరోగ్య పరిరక్షణ, సురక్షిత జీవనం వంటి అంశాలపై అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ డివిజన్ షీ టీం ఇంచార్జీ ఏఎస్ఐ తులసిరాం, కానిస్టేబుల్ చాంగుబాయి, చైల్డ్ ప్రొటెక్షన్ శాఖ అధికారి విఠల్ నర్సింలు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జెబా, ఏపీఎం వంశీకృష్ణ, సీసీలు శైలూ, రాములు, సమత, కల్పన, బేబీ, అకౌంటెంట్ శోభన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలికలు అధికారులు చెప్పిన సూచనలను ఆసక్తిగా విన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News