Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ

పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ

పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ
26-05-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* రక్షకభటులకు వడదెబ్బ నివారణ మందుల పంపిణీ

* ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్

నిరంతరం ప్రజల రక్షణ కోసం ఎండనక, వాననక శ్రమించే రక్షకభటుల ఆరోగ్య సంరక్షణకు సహస్ర ఫౌండేషన్ తన వంతు సహాయం అందించిందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ అన్నారు. మంగళవారం చౌటుప్పల పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మధ కుమార్ సమక్షంలో పోలీస్ సిబ్బందికి హోమియోపతి వడదెబ్బ నివారణ ఔషధాలను ఆయన పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి కాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా పోలీసులు వడదెబ్బ బారిన పడకుండా ఈ మందులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. ఆరోగ్యం బాగుంటేనే విధులు సక్రమంగా నిర్వహించగలరని గుర్తుచేశారు.​ ప్రస్తుత కాలంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం ఉందన్న ఆయన, సిబ్బంది అంతా ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.​ఈ కార్యక్రమంలో సహస్ర ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ

Article Image

* రక్షకభటులకు వడదెబ్బ నివారణ మందుల పంపిణీ

* ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్

నిరంతరం ప్రజల రక్షణ కోసం ఎండనక, వాననక శ్రమించే రక్షకభటుల ఆరోగ్య సంరక్షణకు సహస్ర ఫౌండేషన్ తన వంతు సహాయం అందించిందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ అన్నారు. మంగళవారం చౌటుప్పల పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మధ కుమార్ సమక్షంలో పోలీస్ సిబ్బందికి హోమియోపతి వడదెబ్బ నివారణ ఔషధాలను ఆయన పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి కాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా పోలీసులు వడదెబ్బ బారిన పడకుండా ఈ మందులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. ఆరోగ్యం బాగుంటేనే విధులు సక్రమంగా నిర్వహించగలరని గుర్తుచేశారు.​ ప్రస్తుత కాలంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం ఉందన్న ఆయన, సిబ్బంది అంతా ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.​ఈ కార్యక్రమంలో సహస్ర ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News