PRINT TIME: July 04, 2026 01:41 AM
చిట్యాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
చిట్యాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
May 14, 2026 07:30 PM
807 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామానికి చెందిన పిన్నోజు ఉపేంద్ర చారి (49) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఉపేంద్ర చారి చిట్యాలలో జరిగిన వివాహ వేడుకలకు హాజరై అనంతరం నల్గొండకు వెళ్లేందుకు తన మోటార్ సైకిల్ (AP 24 N 7546) పై బయలుదేరాడు.చిట్యాల పట్టణంలోని సుజనా థియేటర్ ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డుపై వెళ్తుండగా, మోటార్ సైకిల్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.మృతుడి భార్య పిన్నోజు రామేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి