Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భూ తగాదాలతో వ్యక్తి హత్య సోదరుడి కుమారుడిపైనే ఆరోపణలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 12:58 PM

చేనేత పరిశ్రమ అభివృద్ధికి బీటీ రోడ్లు అవసరం. విప్ వేముల వీరేశంను కలిసిన రాపోలు నరసింహ

చేనేత పరిశ్రమ అభివృద్ధికి బీటీ రోడ్లు అవసరం. విప్ వేముల వీరేశంను కలిసిన రాపోలు నరసింహ

చేనేత పరిశ్రమ అభివృద్ధికి బీటీ రోడ్లు అవసరం. విప్ వేముల వీరేశంను కలిసిన రాపోలు నరసింహ
May 25, 2026 06:28 PM 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరిపురం రోడ్ల అభివృద్ధికి వినతి

: పెద్దకాపర్తి నుంచి సిరిపురం వరకు, వెలిమినేడు నుంచి సిరిపురం మీదుగా ఇంద్రపాలనగరం వరకు రహదారులను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహ, నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిపురం గ్రామం దశాబ్దాలుగా చేనేత రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి కోట్ల రూపాయల విలువైన చేనేత ఉత్పత్తులు మార్కెట్‌కు చేరుతున్నప్పటికీ సరైన రహదారి సదుపాయం లేక పరిశ్రమ అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ప్రతిపాదిత రహదారులు అభివృద్ధి చెందితే సిరిపురం గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా చేనేత పరిశ్రమకు కొత్త ఊపిరి లభిస్తుందని వివరించారు. ఉపాధి అవకాశాలు పెరిగి వందలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న సిరిపురం భవిష్యత్తులో చేనేత పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

వినతిపత్రంపై స్పందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News