పెట్రోల్ ధరల పెంపుపై డీవైఎఫ్ఐ నిరసన. బైక్లను నెట్టుకుంటూ వినూత్న ఆందోళన
పెట్రోల్ ధరల పెంపుపై డీవైఎఫ్ఐ నిరసన. బైక్లను నెట్టుకుంటూ వినూత్న ఆందోళన
Editor Desk
నల్గొండ, : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్గొండలో సుభాష్ విగ్రహం నుంచి క్లాక్టవర్ వరకు బైక్లను నెట్టుకుంటూ వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. ప్రజల ఆదాయం తగ్గుతున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు వెంటనే ఇంధన ధరలు పెంచుతున్న ప్రభుత్వం.. ధరలు తగ్గినప్పుడు మాత్రం ప్రజలకు ఉపశమనం కల్పించడం లేదని విమర్శించారు. రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే దశలవారీగా ధరలు పెంచడం ప్రజావ్యతిరేక చర్య అని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్లపూడి రాము, మాదాసు రావణ్, ఎండీ అదిల్, శివ, సాయి, రోహిత్, మధు, రఘు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి